Thursday, April 18, 2024

ప్ర‌కృతిపై ప్రేమ‌.. వినూత్నంగా పెళ్లి కార్డు

ఒక్కొక్క‌రికి ప‌చ్చ‌ద‌నం.. ప్రకృతి అంటే ఎన‌లేని ప్రేమ ఉంటుంది. అదే త‌ర‌హాలో ప్ర‌కృతి పై ఉన్న ప్రేమను పెండ్లి కార్డులోనూ చూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మంచాల జ్ఞానేందర్‌, శ్రీలక్ష్మి దంపతులు. ఫిబ్రవరి 24న జరిగే తన కూతురు శరణ్య వివాహానికి వినూత్న రీతిలో ఆహ్వాన పత్రికలు తయారు చేయించారు. వివాహం జరిగిన తర్వాత ఈ కార్డును మట్టితో కూడిన పాత్రలో పెడితే రెండు రోజుల తరువాత అందులో నుంచి తులసి మొక్క బయటకు రావడం ఈ కార్డు ప్రత్యేకత అని వారు చెప్తున్నారు. మొత్తానికి ప్ర‌కృతిపై త‌మ ప్రేమ‌ని ఇలా చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement