Friday, April 19, 2024

కరోనా నుంచి కోలుకున్న సింహాలు…

హైదరాబాద్ – నెహ్రు జంతు ప్రదర్శన శాలలో ఇటీవల కరోనా బారినపడిన 8 సింహాలు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెల 22న సింహాలు అనారోగ్యంగా కనిపించడంతో సిబ్బంది వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శ్వాస కోస సమస్య, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించిన వెటర్నరీ వైద్యులు తగిన వైద్యం అందించారు. ఏప్రిల్‌ 24న జూ అధికారులు ఈ విషయాన్ని సీసీఎంబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు సింహాల ముక్కులోంచి శ్రావాలను సేకరించి పరీక్షలు నిర్వహిచడంతో వాటికి కరోనా నిర్ధారణ అవడంతో ఈ నెల 4న సీసీఎంబీ నుంచి జంతు ప్రదర్శనశాల అధికారులకు నివేదిక అందింది. అప్పటికే వెటర్నరీ వైద్యులు చికిత్స ప్రారంభించడం వల్ల 8 సింహాలు క్రమంగా కోలుకున్నాయి. ప్రస్తుతం అవి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. సింహాలను సంరక్షించే సిబ్బంది నుంచే వాటికి వైరస్‌ సోకి ఉండొచ్చని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో జంతు ప్రదర్శనశాల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈనెల 2 నుంచి జంతు ప్రదర్శనశాలను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జంతు ప్రదర్శనశాల మూసే ఉంటుదని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement