Thursday, April 25, 2024

బంజారాహిల్స్ పీఎస్ లో 11 మంది పోలీసులకు కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సీఐ, ఎస్సై సహా 9 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. ఇదే పోలీస్ స్టేషన్‌లో గతంలో 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారినపడి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పోలీస్ స్టేషన్‌లో  9 మంది కానిస్టేబుళ్లు, సీఐ, ఓ మహిళా ఎస్సై కరోనా బారినపడడం ఆందోళన రేకెత్తిస్తోంది. మరో పక్క కరోనా కేసుల సంఖ్య రోజుకు వెయ్యిపైనే నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా ఉదృతి తగ్గడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement