Friday, April 19, 2024

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..

చిట్యాల ప్రభన్యూస్ : అప్పుల బాధ భరించలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు నాగుల రాజయ్య (47) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాస్పటల్లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడి భార్య శారద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావు కథనం ప్రకారం వివరాలిలాన్నాయి. నాగుల రాజయ్య గత రెండు సంవత్సరాల క్రితం కూతురు వివాహంచేయగా రూ.2.5 లక్షలు కట్నకానుకలు అప్పు తెచ్చిఇచ్చాడు. మృతుడి కుటుంబానికి ఎటువంటి వ్యవసాయ భూమి లేకపోవడంతో గత కొన్ని సంవత్సరాల నుండి నాలుగు ఎకరాల భూమిని కౌలుకు చేసుకొని వ్యవసాయం చేయగా పంటలు సరిగా పండక రూ.లక్షన్నర బయట వారి దగ్గర అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్ర రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement