Thursday, April 25, 2024

నేటి నుంచి లాసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేటి నుంచి టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈనెల 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఈనెల 10 నుంచి 12 వరకు గడువు విధించారు.

లా సెట్ కౌన్సెలింగ్ తర్వాత సీట్ల కేటాయింపు ఈనెల 17న చేపట్టనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో 18 నుంచి 20తేదీ వరకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని లాసెట్‌ కన్వీనర్‌ ప్రొ.పి.రమేష్‌ బాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement