Thursday, March 28, 2024

లారీ, బైకు ఢీకొని వ్యక్తి మృతి.. అదేబైకు ఢీకొని కానిస్టేబుల్ కు గాయాలు

తాండూరు, (ప్రభన్యూస్) : లారీ, బైకు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా అదే ప్రమాదానికి కారణమైన బైకు కానిస్టేబుల్ ని ఢీ కొట్టింది. తీవ్రగాయా లైన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలో ఈ సంఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భవాని ఫంక్షన్ సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్లో అక్కల చిన్నయ్య అలియాస్ చిన్ని కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తాను పనిచేస్తున్న యజమానిని ఆర్టీసీ బస్టాండ్ వద్ద దింపేదుకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఇదే బైకుపై చిన్ని కుమారుడు అక్కల నాని కూడ ఉన్నాడు. ఇద్దరు కలిసి తాండూరు బస్టాండు వైపు నుంచి చించొల్లి రోడ్డు వైపు వస్తున్నాడు.

అదే సమయంలో సెయింట్ మార్క్స్ స్కూల్ సమీపంలో తాండూరు పట్టణ ఎస్ఐ అరవింద్ కుమార్ శేఖర్ అనే కానిస్టేబుల్ తో కలిసి డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. బైకుపై వస్తున్న చిన్ని తన ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అనుకోకుండా లారీ, బైకు రెండు ఢీకొన్నాయి. ఈ క్రమంలో బైక్ పై ఉన్న చిన్ని కిందపడిపోవడం.. బైకు చేజారిపోవడం జరిగిపోయాయి. కిందపడిన చిన్ని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్ని నడిపిస్తున్న బైకు అదుపు తప్పి దూసుకుంటూ వచ్చి అక్కడే డ్రంక్ డ్రైవ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శేఖర్ను ఢీకొట్టింది. దీంతో శేఖర్ కూడ కిందపడి తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన పోలీసులు మృతున్ని, కానిస్టేబులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement