Thursday, April 18, 2024

ఆర్‌. కృష్ణయ్యపై భూ కబ్జా కేసు.. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైన ఆర్‌. కృష్ణయ్యపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన రవీందర్‌రెడ్డి తన భూమిని ఆర్‌. కృష్ణయ్య కబ్జా చేశారని, భూమిని కబ్జా చేయడంతో పాటు తనను చంపేందుకు కూడా ప్రయత్నించారంటూ ఉప్పర్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. తనను చంపేందుకు కొంత మంది రౌడీలను కూడా పంపించి బెదరిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కృష్ణయ్యపై కేసు నమోదు చేయాలని రాయదుర్గ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆర్‌. కృష్ణయ్యతో పాటు మరికొందరిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు ఐపీసీ 447, 427, 506, 384 రెడ్‌ విత్‌ 34 కింద కేసులు నమోదు చేశారు. ఏపీ కోటా నుంచి వైసీపీ అభ్యర్థిగా రాజ్యసభ ఏంపీగా ఎన్నికైన తరుణంలోనే తెలంగాణలో నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement