Thursday, April 18, 2024

ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ముట్ట‌డించిన లంబాడీ హ‌క్కుల స‌మితి

లంబాడీలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రగతి భవన్‌ను ముట్టడించింది. భారీగా తరలివచ్చిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దళితులకు దళిత బంధు పేరుతో నిధులు విడుదల చేసినట్టే లంబాడీలకు నిధులు విడుదల చేయాలన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి లంబాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలన్నారు. పోడు భూములలో అధికారులు వేధింపులు ఆపాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించక పోతే హుజురాబాద్ లో ఒడిస్తామని  లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: హౌస్ అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు రేవంత్ ఫిర్యాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement