Thursday, April 18, 2024

సింగరేణి కాలనీ ఘటనః నిందితుడికి శిక్షించాలన్న కేటీఆర్

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటనపై మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆరేళ్ల చిన్నారి లైంగిక వేధింపులు, హత్య వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్టు చేసినట్టు తెలిపారు. చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.

కాగా, సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై ఓ కిరాతకుడు లైంగిక దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ రాజు చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement