Saturday, April 20, 2024

ఈ నెల 7న మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన.. టెక్స్ టైల్ పార్కులో శంకుస్థాపన ?

రాష్ట్ర పురపాలక, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 7 వరంగల్ జిల్లా పర్యటన ఖరారైంది. హనుమకొండలో సాఫ్ట్ పాత్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ కార్యాలయాన్ని కిషన్ పురా ప్రాంతంలో ప్రారంభించనున్నారు. ఆ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పీజీ ఆర్ గార్డెన్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమ ల శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొననున్నారు. కాగా అదే రోజు వరంగల్ జిల్లాలోని కాకతీయ టెక్స్ టైల్స్ పార్క్ లో ఓ టెక్స్ టైల్స్ కంపెనిని ప్రారంభించి, మరో కంపెనీకి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మంత్రి వరంగల్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇప్పటివరకు ఖరారు కానప్పటికీ, టెక్స్ టైల్స్ పార్క్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల గురించి అధికారులతో చర్చించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement