Tuesday, March 26, 2024

సివిల్స్ విజేత‌ల‌ను అభినందించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సివిల్ సర్వీసెస్‌ పరీక్షలో ఆలిండియా 20వ ర్యాంక్ సాధించిన‌ శ్రీజను, 218వ ర్యాంక్ సాధించిన‌ కంకణాల రాహుల్‌రెడ్డిని అభినందించారు. తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీజ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అత్యంత ప్రతిభా పాటవాలతో సివిల్స్‌లో విజయం సాధించిన శ్రీజను మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

శ్రీజ తల్లి ప్రభుత్వ దవాఖానలో స్టాఫ్‌నర్సుగా, తండ్రి ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న నేపథ్యం నుంచి వచ్చిన శ్రీజ 20వ ర్యాంక్‌ సాధించి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గొర్లవేడు గ్రామానికి చెందిన కంకణాల రాహుల్‌రెడ్డి సైతం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ రాహుల్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా శ్రీజ విద్యాభ్యాసం, ప్రిపరేషన్‌, ఇంటర్వ్యూ తదితర అంశాలను మంత్రి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement