Wednesday, April 17, 2024

23న కేఆర్‌ఎంబీ భేటీ.. పాల్గొనున్న ఐదు రాష్ట్రాల అధికారులు

ఈ నెల 23న చెన్నైలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో తాగునీటి కమిటీ సమావేశం జరుగనున్నది. వర్చువల్‌ విధానంలో కమిటీ ఆరో సమావేశం జరుగనుండగా.. మీటింగ్‌లో ఐదు రాష్ట్రాల అధికారులు పాల్గొనున్నారు. కేఆర్‌ఎంబీ ప్రతినిధులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన అధికారులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా తెలుగుగంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల తాగునీటి సరఫరా అంశంపై కేఆర్‌ఎంబీ ప్రతినిధులు, ఐదు రాష్ట్రాల అధికారులు చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement