Thursday, April 25, 2024

నేటి కేఆర్‌ఎంబీ ఉప కమిటీ భేటీ వాయిదా

గులాబ్‌ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం తలపెట్టిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సబ్‌ కమిటీ సమావేశం వాయిదా పడింది. అక్టోబరు 14 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి రానున్న నేపథ్యంలో సంస్థాగత నిర్మాణంపై నోటి ఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. గెజిట్‌ అమలు తదుపరి కార్యాచరణపై ఇప్పటికే ఒకసారి కృష్ణా బోర్డు ఉప కమిటీ సమావేశం జరగ్గా… రెండో సమావేశం మంగళవారం జరగాల్సింది అయితే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సమావేశాన్ని వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement