Friday, April 19, 2024

కొత్త‌గూడెం పోలీసుల ప‌నితీరు భేష్: డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్ నుండి సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్న డీజీపీకి ఎస్పీ సునీల్ దత్ స్వాగతం పలికారు. జిల్లా పోలీసు అధికారులతో మావోయిస్టుల ప్రాబల్యంపై సమీక్షించ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సారధ్యంలో పోలీసు అధికారులు.. ప్రజల సహకారంతో అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అతి తక్కువ కాలంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో అన్నిరకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో కూడా ఎస్పీ సునీల్ దత్ పనితీరు అభినందనీయం అన్నారు.

జిల్లా పోలీసు అధికారులు స్పెషల్ పార్టీ కమాండోలు బాధ్యతగా తమ విధులును నిర్వరిస్తూ నిషేధిత మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని డీజీపీ అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ వి. తిరుపతి, ఏఆర్ అడిషనల్ ఎస్పి శ్రీనివాసరావు, ఏఎస్పీలు శబరీష్, వినీత్ , రోహిత్ రాజు, అక్షాన్ష్ , ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement