హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం నాడు రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహం నిర్మాణం పనులను మరో సారి పరిశీలించారు. అంతకుముందు ఈ నెల 10 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విగ్రహం నిర్మాణం పనులు పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణంలో కొప్పుల మీడియాతో మాట్లాడుతూ, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ఆవిష్కరించునున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా హుస్సేన్సాగర్ తీరంలో భారీ విగ్రహాన్ని నిర్మించతలపెట్టినట్టు త్రి చెప్పారు.
విగ్రహ ఆవిష్కరణ గడువు సమిస్తుండటంతో నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని మంత్రి ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులు చేసి గడువు లోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ లను కోరారు. ఏప్రిల్ 14న అట్టహాసంగా జరిగే ఈ విగ్రహావిష్కరణకు దేశంలోని పలువురు ప్రముఖులు హాజరవుతున్నందున ఏప్రిల్ 5లోగా అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన విగ్రహం, ల్యాండ్సేప్ ఏరియా, రాక్ గార్డెన్, లాన్స్లో ప్లాంటేషన్, పార్లమెంట్ ఆకృతి వచ్చే స్థంభాల సాండ్ స్టోన్ వర్స్, వాటర్ ఫౌంటైన్, పారింగ్ ఏరియా, మెయిన్ ఎంట్రన్స్ క్లాడింగ్ వర్స్, గ్రానైట్ ఫ్లోరింగ్, అధునాతన ఆడియో, వీడియో రూం తదితర అన్ని రకాల పనులకు చార్ట్ రూపొందించుకొని, ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని, అందుకు సరిపడా మ్యాన్పవర్ను పెంచాలని సూచించారు.