Friday, April 19, 2024

విశ్వేశ్వరరెడ్డిని మ‌ర్యాదపూర్వ‌కంగా కలిసిన కూడేరు ఎంపీడీఓ

కూడేరు ఎంపీడీఓ యాదవేంద్ర , ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ ,మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిని మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనను కలిసారు. మాజీ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేశారు.తమ మీద నమ్మకం ఉంచి పోస్టింగ్ ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.అనంతరం ఆయనతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. కూడేరు మండల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లి… ప్రజల సమస్యలను రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకెళ్ళాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ఎటువంటి ఇబ్బందులు వున్నా, తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ సమావేశంలో కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పిటిసి భర్త అశ్విని హరీష్. వైస్సార్సీపీ జిల్లా నాయకులు వసికెరీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement