Thursday, April 25, 2024

వాళ్లే కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతారు: కోమటిరెడ్డి హెచ్చరిక

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ బోర్డు తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

‘కేసీఆర్ గుర్తుపెట్టుకో… ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటు హక్కు వస్తుంది. వారి జీవితాలతో చెలగాటమాడుతున్న మీకు, మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బాధిత విద్యార్థులు తగిన బుద్ధిచెప్పడం ఖాయం!’ కోమటిరెడ్డి హెచ్చరించారు.

https://twitter.com/KomatireddyKVR/status/1473200842828177408
Advertisement

తాజా వార్తలు

Advertisement