Wednesday, April 24, 2024

కాళేశ్వరం బాధితులకు నష్టపరిహారం ఏది?: కోదండరాం

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి నిర్వహణ పద్ధతుల్లో లోపాల కారణంగా ప్రతి ఏటా రైతుల పంట కోతకు గరువుతోందని తెలిపారు. మూడేళ్ళల్లో 7 వేల ఎవరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. నీటి నిర్వహణలో సమూలంగా మార్పులు చేయాలని సూచించారు. రైతులు పంట నష్టపోకుండా ప్రభుత్వమే శాశ్వత పరిష్కారం చూపాలని కోందరాం డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement