Friday, March 29, 2024

ద‌ళితబంధుపై కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ద‌ళిత‌బంధుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంబేద్కర్‌ వర్థంతి సంద‌ర్భంగా కిషన్‌రెడ్డి ఆయ‌న‌కు నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసమే దళితులను కేసీఆర్‌ మభ్యపెట్టారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు చేయటంలేదో కేసీఆర్‌ చెప్పాలని అయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితులకు మేలు చేసే ఉద్దేశ‌ముంటే తక్షణమే దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీపై నిందలు వేసి వరద బాధితులకు నష్టపరిహారం ఎగ్గొట్టారని.. ఇప్పుడు మరోసారి త‌మ మీద నిందలు వేసి దళితు బంధును పక్కన పెట్టారన్నారు. కేసీఆర్‌వి అన్ని మాయమాటలేనని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందుకు గుర్తుకు ద‌ళిత‌బంధు ఇప్పుడు గుర్తుకు రాలేదా అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement