Thursday, March 28, 2024

కాంగ్రెస్ నుండి తెరాసలో చేరనున్న కార్పొరేటర్ లు, సర్పంచ్..

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన, కాంగ్రెస్ కార్పొరేటర్ లు మోతారపు శ్రావణి(55వ డివిజన్), ధానాల రాధ(17వ డివిజన్), రఘునాధపాలెం మండలం బుడిదంపాడు గ్రామ సర్పంచ్ మీరా(కాంగ్రెస్)తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు నేడు హైదరాబాద్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సమక్షంలో తెరాస పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా TRS పార్టీలో చేరేవారితో కలిసి ఖమ్మం VDO’s కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన మేయర్ పునుకొల్లు నీరజ , సూడా చైర్మన్ విజయ్ కుమార్ , పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు , జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి RJC కృష్ణ , మంత్రి PA CH.రవికిరణ్ పలువురు నాయకులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement