Thursday, March 28, 2024

ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడివి? : ఎమ్మెల్యే రఘునందన్ రావు

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు నిలదీశారు. కేసీఆర్‌కు గతంలో దొంగలుగా కనిపించిన ఆంధ్రవాళ్లు.. ఇప్పుడు బంధుమిత్రులుగా మారిపోయారని రఘునందన్‌రావు విమర్శించారు. మియాపూర్‌లోని వేల కోట్ల విలువైన భూములను.. తోట చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారని, ఇదంతా సోమేష్‌కుమార్ కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర ఉంద‌ని, సుఖేష్‌గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి కలెక్టర్.. తోట చంద్రశేఖర్ వ్యవహారంలో సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement