Thursday, April 25, 2024

బస్సును ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

ఖమ్మం : ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ చౌరస్తాలో సిగ్నల్స్ వద్ద పెట్రోల్ టాంకర్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఏన్కూర్ నుండి ఖమ్మం బస్టాండ్ కు వస్తున్న పల్లె వెలుగు బస్సు వైరా నుండి వరంగల్ సైడు వెళ్లే పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి సిగ్నల్స్ వద్ద ఢీకొన్నాయి. సిగ్నల్స్ పాస్ చేసి ముందుకు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఫ్రీ జోన్ నుంచి వస్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఒక్కసారిగా మెయిన్ రోడ్డు మీదకు రావడంతో అదుపుతప్పి రెండు వాహనాలు ఢీకొనే సమయంలో ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి డివైడర్ ఢీకొట్టడంతో
పెను ప్రమాదం తప్పింది. బస్సు, లారీ ముందు భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లు, బస్సులో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని రూట్ క్లియర్ చేశారు. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement