Friday, April 19, 2024

పరమ పవిత్రం రంజాన్ మాసం : మంత్రి పువ్వాడ

ముస్లింలు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండగను జ‌రుపుకుని ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరం 57వ డివిజన్ రెహమాన్ నగర్ మజీద్ నందు మంత్రి పువ్వాడ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా సోదరులు ఎంతో నిష్టగా ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న పేద ముస్లిం లకు మజీద్ ఆధ్వర్యంలో నెల రోజులకు సరిపడ బియ్యం, నిత్యావసర సరుకులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement