Wednesday, April 24, 2024

లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ పునరావాస నగదును అందజేసిన ఎస్పీ సునీల్ దత్

జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ తన కార్యాలయంలో ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన ఐదుగురు మావోయిస్టులకు పునరావాసం, తక్షణ సహాయం క్రింద నగదును చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. మావోయిస్ట్ పార్టీ దళ సభ్యులు మడవి అడమి @విజ్జి@సింధు, దళ సభ్యరాలు,R/o.రాళ్లపురం గ్రామం,చర్ల మండలం. పోడియం.సంతోష్@విక్రమ్@బీదయ్య,దళ సభ్యుడు,R/oకిష్టారంపాడు గ్రామం,చర్ల మండలం. మడకం.బుద్రి@సోనీ, మణుగూరు LOS సభ్యుడు,R/o.పుట్టపాడు,సుకుమా జిల్లా,CG, మడవి.ఇడుమ@సురేందర్,ఏరియా కమిటీ సభ్యుడు, BK-EG డివిజన్ సెక్రటరీ ఆజాద్ కు గార్డ్ కమాండర్,R/o.బూరుగుపాడు గ్రామం, చర్ల మండలం, ముసికి.బుద్రి@BR@నరేష్,దళ సభ్యుడు,బీజాపూర్ జిల్లా,CG.ఈ ఐదుగురు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1,00,000ల నగదును చెక్కుల రూపంలో ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ అందజేశారు. మావోయిస్టు పార్టీ నాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యులు పోలీసు వారి ఎదుట లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనాన్ని గడపాలని కోరారు. లొంగిపోయిన వారిపై ఎలాంటి కేసులు లేకుండా చేసి, ప్రభుత్వం తరపు నుండి, పోలీసుశాఖ తరపు నుండి అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement