Tuesday, April 16, 2024

రామయ్య సన్నిధిలో వైభ‌వంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజు ధనలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం 8 గంటలకు (మూలమూర్తికి) అమ్మవారికి పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు భక్తులకు ధనలక్ష్మి అలంకార దర్శనం కల్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహిక కుంకుమ అర్చనలు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం జరుగనుంది. రేపు ధాన్యలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement