Friday, April 19, 2024

సత్తుపల్లి బీఆర్ఎస్ నేత దయానంద్ కు అస్వస్థత..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో సత్తుపల్లి బీఆర్ఎస్ నేత మట్టా దయానంద్ అస్వస్థతకు గుర‌య్యాడు. లంకాసాగ‌ర్ గ్రామంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఆయ‌న అస్వస్థతకు గురికావ‌డంతో హుటాహుటిన సత్తుపల్లిలోని జూపల్లి సీతారామయ్య హాస్పటల్ కు త‌ర‌లించారు. అనంత‌రం అక్కడి నుండి మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్ తరలించారు. స్వల్ప గుండె పోటుకు గురైనట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఎంజియోగ్రం కోసం దయానంద్ ను హైద్రాబాద్ కు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement