Saturday, April 20, 2024

ఇల్లందులో శానిటేషన్ సిబ్బంది.. విధులు బహిష్కరణ

శానిటేషన్ అధికారి రాధాకృష్ణపై మాజీ వార్డ్ కౌన్సిలర్ ప్రస్తుత వార్డ్ కౌన్సిలర్ భర్త ఎలమందల వాసు దాడి చేశాడు. దాంతో ఈ ఘ‌ట‌న‌ని నిరసిస్తూ శానిటేషన్ సిబ్బంది తమ విధులను బహిష్కరించారు. విధుల్లో ఉన్న అధికారిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు బూతులు తిట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు..దాడికి పాల్ప‌డిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బంది డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement