Thursday, April 18, 2024

రూ.2.40 కోట్ల నిధులు మంజూరు.. క‌లెక్ట‌ర్ కి చెక్కు అంద‌జేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో గతంలో రూ.2 కోట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. ఆయా నిధులతో అనేక పనులు, డొంక రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండలంలో మిగిలి ఉన్న డొంక రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం మండల రైతుల అభ్యర్థన మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ప్రత్యేక చొరవ చూపించి TRANSCO శాఖ CSR ఫండ్స్ ద్వారా రూ.2.40 కోట్లు మంజురు చేయించారు. గురువారం ఆ చెక్కును జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు మంజూరైన ఆయా నిధులు మండలంలోని అభివృద్ధి పనులకు వినియోగించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement