Friday, March 29, 2024

ఖ‌మ్మంలో టి ఆర్ ఎస్ క్లీన్ స్వీప్ త‌ధ్యం … మంత్రి పువ్వాడ‌

ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెరాస విజయం సునాయాసమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23,37,38వ డివిజన్లలో టిఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్ధులు మెక్బూల్, ఫాతిమా జోహారా, అలియాలను గెలిపించాలని కోరుతూ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ, ఎంపి నామా నాగేశ్వ‌ర‌రావుతో క‌ల‌సి ఆయా డివిజన్లలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు..ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, నగరానికి రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేసిన తెరాసను నగర ప్రజలు మరోసారి ఆశీర్వదించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. ప్రతిపక్ష పార్టీలకు ఖమ్మంలో మనుగడ లేదని.. ఖమ్మం కార్పొరేషన్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తామన్నారు. ”ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అన్ని డివిజన్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. అన్ని కులాలు, వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేశాం. ఎక్కడా కూడా రెబల్స్‌ లేరు. అన్ని చోట్ల నేతలు, కార్యకర్తలు కలిసి సమన్వయంతో పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు. అభ్యర్థులకు విజయం సునాయాసంగా లభిస్తుంది. తెరాసకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసిన తర్వాత ప్రతిపక్షాలను బెదిరించాల్సిన అవసరం తెరాసకు లేదు. మరోసారి ప్రతిపక్షాలను తిరస్కరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement