Thursday, April 25, 2024

ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం బయల్దేరిన మంత్రులు, ఎంపీ

ఎఫ్ఆర్వో చల్లమల్ల శ్రీనివాస రావు గుత్తికోయ‌ల‌ దాడిలో గాయ‌ప‌డి మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాల‌ని మంత్రులు, ఎంపీల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం నగరానికి హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి తోపాటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు బయల్దేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement