Thursday, April 18, 2024

ద‌గ్గు, జ‌లుబు ఏం లేదుగా! అంతా బానే ఉన్నారా? .. ఆరోగ్య స‌ర్వేలో అజ‌య్‌కుమార్..

ఏమ్మా.. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటివి ఏం లేవుగా? అంతా బానే ఉన్నారా? ఏమ‌న్నా ఉంటే చెప్పండి… అంటూ ఆరోగ్య శాఖ మంత్రి అజ‌య్‌కుమార్ వివ‌రాలు తెలుసుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 9.45 గంట‌ల‌కు ఖ‌మ్మం కార్పొరేష‌న్ ప‌రిధిలోని 56వ డివిజ‌న్‌లో ఆయ‌న ఆరోగ్య‌శాఖ నిర్వ‌హిస్తున్న స‌ర్వే తీరును ప‌రిశీలించారు. సాయిబాబా టెంపుల్ ప‌క్క‌నున్న చిగురుపాటి లక్ష్మ‌య్య దంప‌తుల ఇంటికి వెళ్లి వివ‌రాలు తెలుసుకున్నారు.

అధికారుల‌కు, ఆరోగ్య సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎంహెచ్‌వో మాల‌తి, ఆరోగ్య సిబ్బంది నీల‌వేణి, ప‌లువురు ఏఎన్ఎంలు, వైద్యులు, డివిజ‌న్ కార్పొరేట‌ర్ రోహిణి స‌త్య‌నారాయ‌ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement