Thursday, March 28, 2024

ఘ‌నంగా వ‌జ్రోత్స‌వాలు… భారీ జాతీయ జెండాతో ర్యాలీ…

స్వాతంత్ర్య భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను ఆగస్టు 8వ తేదీ నుండి 22 వరకు వైభవోపేతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖ‌మ్మం నగరం జ‌డ్పీ సెంటర్ నుండి 10 వేల మందితో రెండు కిలమీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మేయర్ పునుకొల్లు నీరజ, విత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ లు స్నేహలత మొగిలి, మధు సుదన్, కార్పొరేటర్ లు, అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement