Monday, April 15, 2024

భద్రాచలం వద్ద గోదావరికి తగ్గిన వరద ఉధృతి… 51.3 అడుగుల‌కు చేరిన నీటిమ‌ట్టం

ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గోదావ‌రి నిన్న‌టి వ‌ర‌కు ఉధృతంగా ప్ర‌వ‌హించింది.. రెండు రోజులుగా వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గుతూ వ‌స్తుంది. ఈరోజు భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం స్వ‌ల్పంగా త‌గ్గింది. గోదావ‌రి నీటిమ‌ట్టం 51.3 అడుగుల‌కు చేరింది. నిన్న సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యానికి వ‌ర‌ద ప్ర‌వాహం 52.20 అడుగుల వ‌ద్ద కొన‌సాగిన విష‌యం తెలిసిందే. గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఆర్టీసీ బ‌స్సులను త‌గ్గించారు. మ‌రో రెండు రోజుల్లో గోదావ‌రి నీటిమ‌ట్టం త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement