Saturday, April 20, 2024

సబ్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం… పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

భదాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారామపురం సబ్‌స్టేషన్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా సబ్‌ స్టేషన్‌లో మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం కారణంగా సబ్‌ స్టేషన్‌లోని పలు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిబూడిదయ్యాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement