Saturday, April 20, 2024

సత్తుపల్లిలో ఇద్దరు విద్యార్థినుల‌ అదృశ్యం..

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమ‌య్యారు. సత్తుపల్లి గిరిజన వసతి గృహంలోని విద్యార్థినులు నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. సదరు విద్యార్థినులు రాజేశ్వరి, శైలజలుగా గుర్తించిన హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు కనిపించడం లేదన్న సమాచారం అందుకున్న తల్లిదండ్రులు సత్తుపల్లి గిరిజన వసతి గృహం దగ్గర ఆందోళన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement