Friday, April 19, 2024

తమ్మినేని కృష్ణయ్య హత్యను ఖండిస్తున్నా : తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌ రావు

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. కృష్ణయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలందరు కోరుతున్నారని తెలిపారు. అధికారులు, పోలీసులు వారి మీదున్న నమ్మకాన్ని, బాధ్యతను గుర్తించి వారి విధులు నిర్వహించాలని సూచించారు. కృష్ణయ్య హత్యను సమర్ధించిన వారు, సపోర్ట్ చేసిన వ్యక్తుల అంతరాత్మ గోషిస్తుందని తెలిపారు. వ్యవస్థలు న్యాయం తరుపున ఉండి కేసును ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులకు శిక్ష పడేందుకు సాయా శక్తులా తాను ప్రయత్నిస్తానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement