Thursday, April 25, 2024

పొన్నెక‌ల్లులో బైక్ ను ఢీకొన్న బ‌స్సు – త‌ల్లికుమారుడు దుర్మ‌ర‌ణం

ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో త‌ల్లి, కుమారుడు దుర్మ‌ర‌ణం చెందారు… స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుండి ఖమ్మం వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు, ఖమ్మం నుంచి కూసుమంచి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న తల్లి, కొడుకు ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు ముత్యాలగుడేనికి చెందిన పల్లెబోయిన ఉపేందర్, పల్లెబోయిన కాంతమ్మలుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement