Wednesday, April 24, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఘ‌నంగా స్వతంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాలు..

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మలు, బోనాలు, డప్పు‌ వాయిద్యాలతో ర్యాలీలో‌ సందడి నెలకొంది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుండి ప్రకాశం స్టేడియం వరకు జాతీయ జెండాతో భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన ర్యాలీ ప్రదర్శనను ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, ఎస్పీ వినీత్ గారు, ZP చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ కాపు సీతా మాలక్ష్మీ, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement