Friday, March 29, 2024

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి.. కుటుంబీకుల ఆందోళన..

ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం సాతనుగూడెంకు చెందిన మమత(21) ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో శుక్రవారం రాత్రి హాస్పిటల్‌లో మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. గత 20 రోజుల క్రితం ఖమ్మం మాతా శిశు కేంద్రంలో మమతకు నార్మల్‌ డెలివరీ కాగా, డెలివరీ పూర్తయిన తర్వాత పొట్ట భాగంలో కుట్లు- వేశారు. కుట్లు సరిగా వేయకపోవడంతో తీవ్ర సమస్యతో బాధ పడుతున్న మమతను తిరిగి శుక్రవారం హాస్పిటల్‌లో వైద్యులు అడ్మిట్‌ చేసుకున్నారు. హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసుకున్న వైద్యులు మమతకు మెరుగైన వైద్యం అందించకపోవడంతో మృతి చెందినట్లు కుటు-ంబ సభ్యులు పేర్కొన్నారు. మృతి చెందిన విషయాన్ని వైద్యులు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. అత్యవసరమని చెపితే తమ బిడ్డను ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లి బ్రతికించుకునే వాళ్లమని… ఎందుకు మాకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మమత మృతికి కారణమైన వైద్యులను సస్పెండ్‌ చేసి, వారి కుటు-ంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మాత శిశు కేంద్రం వద్ద కుటుంబికులు ఆందోళన చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement