Thursday, March 28, 2024

రెహమాన్ కు మెకానికల్ వర్కర్స్ నివాళి..

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మండల కేంద్రంలో ఫౌండ్రీ షాప్ నడిపిస్తున్నటువంటి అబ్దుల్ రెహమాన్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఏన్కూర్ మోటార్ మెకానికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు .ఏనుకూరు మోటర్ మెకానికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పెనుగొండ రంగారావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరావు.యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్లాడి నాయకులు శేఖర్,వేణు, మాధవాచారి, రాజేష్,జానీ, మై బెల్లీ,షరీఫ్,మోహన్రావు, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement