Friday, March 29, 2024

నీటి తొట్టిలో పడి బాలుడు మృతి.

సత్తుపల్లి, (ప్రభ న్యూస్) : సత్తుపల్లి మండలం, కిష్టారం కొత్త ఎస్సీ కాలనీలో బుధవారం నిఖిల్ అనే బాలుడు (3) నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. మృతుని తల్లి మొక్కజొన్న ఎన్ను విరవడం కోసం వెళ్ళగా తండ్రి కమలాకర్ ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేందుకు వెళ్ళాడు, బాలుడి మంచి చెడులు చూసుకునేందుకు నాయనమ్మను ఇంట్లో ఉంచారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు బాలుడితో ఆరుబయట ఆడుకున్న నాయనమ్మ వంట చేసేందుకు ఇంట్లోకి వెళ్లింది, ఈలోగా తోట్టి దగ్గరకు వెళ్లిన బాలుడు అందులో జారిపడ్డాడు. పావుగంట తర్వాత బయటకు వచ్చిన నాయనమ్మకు బాలుడు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన నాయనమ్మ సమీపంలోని ఇళ్లకు తిరిగి బాలుడి కోసం గాలించింది. ఆచూకీ లభించకపోవడంతో తిరిగి ఇంటికి చేరుకుంది.

నీళ్లు తోడదామని తొట్టి వద్దకు వెళ్లి బకెట్ వేసే సరికి తొట్టిలో బాలుడు కనిపించాడు. ఆందోళనకు గురైన నాయనమ్మ చుట్టుపక్కల వాళ్ళను పిలిచి బయటకు తీశారు.అప్పటికే మృతిచెంది ఉండటంతో లబోదిబోమంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది, కొడుకు,కోడలుకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు కనిపించిన కొడుకును చూసి గుండెలు బాదుకుంటూ విలపించారు, బాలుడి మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement