Monday, March 25, 2024

Khammam: ఎకరాకు రూ.10వేలు.. నేటి నుండి పంపిణీ.. మంత్రి పువ్వాడ

ఖమ్మం : రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు, వడగండ్లతో పంటలు నష్ట పోయిన రైతులను అదుకున్న ఘనత సిఎంకేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు రైతు దినోత్సవం సందర్భంగా రఘునాథపాలెం, రంక్యా తండా రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సంబరాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఇటీవల కురిసిన వడగళ్ల వానలు, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు కేంద్రం సిఫారసుల కంటే అధికంగా ఎకరాకు రూ.10వేలు చొప్పున సహాయ, పునరావాస సాయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఆయా సాయం నేటి నుండి రైతులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావంతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ రూ.228 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం ఒక్క కేసీఆర్ కే సాధ్యమన్నారు.

ఖమ్మం జిల్లా రైతులకు రూ.23 కోట్లు విడుదల అయ్యాయని ఆన్నారు. రఘునాథపాలెం మండలంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని పేర్కొన్నారు. రూ.20 కోట్లతో సుడా పార్క్ పక్కనే పేదల ఉచిత నాణ్యమైన విద్యబ్కోసం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను నిర్మిస్తున్నామని అన్నారు. మండల ప్రజలకు కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్, ఆసరా పెన్షన్లు, రైతు బందు, రైతు భీమా, ఉచిత విద్యుత్, రైతులకు ఎరువులు, డబుల్ బెడ్ రూం ఇల్లు, విత్తనాలు, చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ ఇలా అనేక పథకాలు విరివిగా అందించిన ఘనత మన BRS ప్రభుత్వందే అన్నారు. ఇవన్నీ మళ్ళీ మనకు అందాలంటే మళ్ళీ కేసీఅర్ గారిని, ఇక్కడ నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ వరకు అద్భుతమైన అభివృద్ది చేసుకున్నామని, ఇక చేయాల్సింది రాజకీయాలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, ఎం పీ పీ గౌరి, జెడ్ పీ టీ సి ప్రియాంక, బీ ఆర్ ఎస్ నాయకులు మద్ధినేని వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement