Tuesday, April 16, 2024

పోలీస్ అమరులకు నివాళులర్పించిన మంత్రి పువ్వాడ

Khammam: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులు అర్పించారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంద‌ర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్ అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని, వారి ఔన్నత్యాన్ని కొనియాడారు. అమరుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement