Tuesday, April 16, 2024

కంటి వెలుగు కార్య‌క్ర‌మంలో భ‌ట్టి విక్ర‌మార్క‌.. ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన కేసీఆర్

ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ లో కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. అయితే కంటివెలుగు ప్రారంభ కార్యక్ర‌మంలో ఊహించని సన్నివేశం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కంటి వెలుగు రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత జాతీయ నేతలకు భట్టిని పరిచయం చేశారు. అయితే భట్టి ఖమ్మం జిల్లాలో మధిర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగానే ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా భట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు దళిత బంధు పథకానికి భట్టి విక్రమార్క మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇలాంటి పథకాలు రావడం మంచి పరిణామమని గతంలో అన్నారు. ప్రగతిభవన్‎లో దళిత బంధు కార్యక్రమం అమలుపై నిర్వహించిన అఖిలపక్ష భేటీకి.. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన హాజరయ్యారు. అదే విధంగా అసెంబ్లీలో బీజేపీని టార్గెట్ చేస్తూ భట్టి ఫైర్ అవుతూ..కేసీఆర్‌కు మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement