Friday, April 19, 2024

కరోనా నుంచి కోలుకున్న కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కేసీఆర్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement