Thursday, March 28, 2024

కేసీఆర్ నాయ‌క‌త్వంలో టీఆర్ఎస్ కు తిరుగులేదు : ఎమ్మెల్సీ క‌విత

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ఘ‌న‌విజ‌యం సాధించడంతో వారికి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కవిత చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపితమైందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందని కవిత పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement