Saturday, April 20, 2024

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ , నేషనల్‌ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ , నేషనల్‌ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ కౌషిక్‌ అధికారి కంగా ప్రకటించారు. కవిత నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌ గా ఏడాది కాలం పాటు- సేవలందించనున్నారు. 2015 నుండి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కమిష నర్‌గా కవిత సేవలందిస్తూ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా అనేక సేవా కార్య క్రమాలు నిర్వహించారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యా ర్థుల భాగస్వామ్యం మరింతగా పెరి గేలా కృషి చేస్తానని కవిత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement