Thursday, April 25, 2024

క‌విత విచార‌ణ స‌శేషం – రేపు మ‌రోసారి…

ఢిల్లీ మద్యం కేసులో క‌విత‌ను నేడు 10 గంట‌ల‌కు పైగా విచారించిన ఈడీ అధికారులు రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌ర‌కావ‌ల‌సిందిగా నోటీస్ జారీ చేశారు.. దీంతో రేపు క‌విత విచార‌ణ‌కు హాజ‌రు అవుతారా లేదా అనేది ఇంత వ‌ర‌కు నిర్ధార‌ణ కాలేదు ..కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మ‌ద్యం కేసులో రెండో సారి నేడు ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు 10 గంటల పాటు ప్ర‌శ్నించారు. ఉద‌యం 10 గంట‌ల‌కు ఈడీ కార్యాల‌యంలోకి వెళ్లిన క‌విత రాత్రి 9.14 నిమిషాల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చారు.. అక్క‌డ నుంచి నేరుగా ఆమె కెసిఆర్ నివాసానికి బ‌య‌లుదేరి వెళ్లారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement