Thursday, April 25, 2024

తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు

కాసాని జ్ఞానేశ్వర్‌ ని టిడిపి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్‌ బ్యూరోలో స్థానం కల్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులు నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాసాని జ్ఞానేశ్వర్‌ ఈనెల 10న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన కాసాని జ్ఞానేశ్వర్ కు తెలుగుదేశం నేతలు అభినందనలు తెలిపారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని జ్ఞానేశ్వర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement