Thursday, April 25, 2024

కరీంనగర్ జిల్లాలో దారుణం.. శానిటైజర్ తాగి యువకుడు మృతి

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గన్నేరువరం మండలం చాకానివ‌నిప‌ల్లి గ్రామంలో మ‌ద్యానికి బానిస అయిన ఓ యువ‌కుడు శానిటైజ‌ర్ తాగి మృతి చెందాడు. ప్ర‌కాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్ సైదా అనే యువ‌కుడు బ‌తుకుదెరువు కోసం చాకానివ‌నిప‌ల్లికి వ‌చ్చాడు. భ‌వ‌న నిర్మాణ రంగంలో కూలీగా ప‌ని చేస్తున్న సైదా మ‌ద్యానికి బానిస అయ్యాడు. ఈ క్ర‌మంలో శ‌నివారం రాత్రి శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని గ‌మనించిన సైదా మేస్త్రీ క‌స్తూరి వెంక‌టేశం పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. సైదా మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ వార్త కూడా చదవండి: రేపు డిశ్చార్జి కానున్న ఈటెల రాజేందర్

Advertisement

తాజా వార్తలు

Advertisement